‘పట్టు పట్టరాదు.. పట్టి విడువ రాదు’ అనే వేమన (vemana) మాటలను తన జీవితంలో అక్షరాలా అమలు చేసి చూపాడు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన అండిబోయిన అశోక్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఏకంగా 50 సార్లకు పైగా విఫలమైనా, ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన కలను వదలకుండా, పట్టుదలతో ముందుకు సాగి చివరకు సర్కార్ కొలువును కైవసం చేసుకున్నాడు.
Read also: AP: డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన
Government Job
21 ఏళ్ల వయసు నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ
అశోక్ తండ్రి విష్ణు టైలర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి ఆదిలక్ష్మి గృహిణి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన అశోక్ మొదట ప్రైవేట్ ఉద్యోగం ఆలోచించినా, దీర్ఘకాల భద్రత కోసం ప్రభుత్వ ఉద్యోగమే సరైనదని నిర్ణయించుకున్నాడు. 21 ఏళ్ల వయసు నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఆర్ఆర్బీ, బ్యాంకులు, ఎస్ఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి అనేక పరీక్షలు రాశాడు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగం మూడు మార్కుల తేడాతో చేజారడం సహా, ఆరు ఉద్యోగాలు స్వల్ప మార్కుల తేడాతో దక్కకపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురి చేశాయి.
అయితే ప్రతి దశలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుడు దీపక్ ఇచ్చిన ఆర్థిక సహకారం అశోక్కు ధైర్యం ఇచ్చాయి. ఏడేళ్ల పాటు నిర్విరామంగా శ్రమించిన తర్వాత, ఇటీవల జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో అశోక్ ఎంపికయ్యాడు. తన కష్టం ఫలించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అశోక్ చెప్పాడు. ఈ రోజు అతడి కథ వేలాది నిరుద్యోగ యువతకు ఓ సజీవ ప్రేరణగా నిలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: