ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం

Read Time:  1 min
ap land registration
ap land registration
FONT SIZE
GET APP

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 2024 ఫిబ్రవరి 1 నుండి భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ, గ్రోత్ సెంటర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ విలువలు సగటున 15 శాతం నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

జనవరి 15లోగా ఈ పెంపు వివరాలను అధికారులు నివేదించాలని ఆయన ఆదేశించారు. చరిత్రలో తొలిసారిగా, కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను తగ్గించనున్నట్లు కూడా మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం శాస్ర్తీయ పద్ధతిలో కాకుండా ఇష్టానుసారం రిజిస్ట్రేషన్ విలువలను పెంచిందని, వాటన్నింటినీ సరి చేస్తామని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

కానీ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, తగ్గింపుల విషయంలో కొన్ని ప్రాంతాల్లో మార్పులు ఉండవని స్పష్టం చేశారు. కమిటీ సిఫార్సులు, గ్రోత్ కారిడార్ల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. భూసమస్యలలో అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, దుష్పరిణామాలను అరికట్టడానికి సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.