📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

Author Icon By Sudheer
Updated: April 3, 2025 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు మంచి సమాచారం లభించనుంది. ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ రూల్స్-2025 నిబంధనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి డ్రోన్ టెక్నాలజీ విభజన, బార్ లైసెన్స్‌ రూల్స్ మార్పులు, కొత్త పోర్టుల ఏర్పాటుకు అనుమతి లభించాయి.

డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు

కేబినెట్ భేటీలో ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి (డీమెర్జ్‌ చేసి) స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏపీడీసీ (ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్‌) రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. వ్యవసాయం, భద్రత, పరిశ్రమల కోసం డ్రోన్‌ల వినియోగం పెరిగేలా ఈ కొత్త సంస్థ పని చేయనుంది.

AP Cabinet Meeting V jpg 442×260 4g

పోర్టుల అభివృద్ధి, హోటల్ రంగానికి ఊరట

కేబినెట్ సమావేశంలో అనకాపల్లి జిల్లాలో క్యాపిటివ్ పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల రాష్ట్రంలో లాజిస్టిక్స్‌ సదుపాయాలు మెరుగవుతాయని, వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. హోటల్ పరిశ్రమకు ప్రోత్సాహంగా బార్ లైసెన్స్‌ ఫీజును రూ.25 లక్షలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల హోటల్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

ప్రధాని మోదీ అమరావతి పర్యటన

కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనపై కూడా చర్చ జరిగింది. అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటన కోసం ముఖ్య కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజధాని అభివృద్ధి పనులకు ఇదొక మలుపుగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

AP Cabinet AP Cabinet Meeting on Key Discussions Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.