हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

Sudheer
AP Cabinet Meeting : జర్నలిస్ట్‌లకు తీపికబురు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు మంచి సమాచారం లభించనుంది. ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ రూల్స్-2025 నిబంధనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి డ్రోన్ టెక్నాలజీ విభజన, బార్ లైసెన్స్‌ రూల్స్ మార్పులు, కొత్త పోర్టుల ఏర్పాటుకు అనుమతి లభించాయి.

డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు

కేబినెట్ భేటీలో ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి (డీమెర్జ్‌ చేసి) స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏపీడీసీ (ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్‌) రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. వ్యవసాయం, భద్రత, పరిశ్రమల కోసం డ్రోన్‌ల వినియోగం పెరిగేలా ఈ కొత్త సంస్థ పని చేయనుంది.

AP Cabinet Meeting V jpg 442x260 4g
AP Cabinet Meeting V jpg 442×260 4g

పోర్టుల అభివృద్ధి, హోటల్ రంగానికి ఊరట

కేబినెట్ సమావేశంలో అనకాపల్లి జిల్లాలో క్యాపిటివ్ పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల రాష్ట్రంలో లాజిస్టిక్స్‌ సదుపాయాలు మెరుగవుతాయని, వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు. హోటల్ పరిశ్రమకు ప్రోత్సాహంగా బార్ లైసెన్స్‌ ఫీజును రూ.25 లక్షలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల హోటల్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.

ప్రధాని మోదీ అమరావతి పర్యటన

కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనపై కూడా చర్చ జరిగింది. అమరావతిలో రాజధాని అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటన కోసం ముఖ్య కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజధాని అభివృద్ధి పనులకు ఇదొక మలుపుగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870