Latest news: Vijayawada: గోదావరి పుష్కరాలు-2027 కార్యదర్శుల బృందం

Read Time:  1 min
Vijayawada
Vijayawada
FONT SIZE
GET APP

విజయవాడ : గోదావరి పుష్కరాలు- 2027 (Vijayawada) కోసం కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 11శాఖల కార్యదర్శులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. దేవాదాయ, జలవనరుల, హోమ్, పుర పాలక, రెవెన్యూ, పర్యాటక, రోడ్లు, భవనాలు, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఇంధన, ఆర్థికశాఖ కార్యదర్శులు ఈ కమిటీలో ఉంటారని వెల్లడించింది.

Read also: జానీ మాస్టర్‌పై చిన్మయి ఫైర్

Vijayawada
Vijayawada: గోదావరి పుష్కరాలు-2027 కార్యదర్శుల బృందం

పుష్కరాలకు వీరపాండియన్ ప్రత్యేక అధికారిగా నియామకం

మంత్రుల(Vijayawada) బృందం తీసుకున్న నిర్ణయాల ప్రకారం, రాబోయే గోదావరి పుష్కరాలు(Godavari Pushkaralu) సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి వీరు విధానాలు, వ్యూహాలు రూపొందిస్తారని తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ను గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిఎస్ విజయా వంద్ ఉత్తర్వులిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.