ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అఖండ గోదావరి ప్రాజెక్టు (Godavari Project) కీలక మలుపు తిరగబోతోంది. ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) ప్రకటించారు.రాజమహేంద్రవరం లో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఈ ప్రాజెక్టు పనులకు జూన్ మొదటి వారంలో శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వెల్లడించారు.ప్రాజెక్టు పనులు వచ్చే గోదావరి పుష్కరాల వరకూ పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక దృక్పథంతో గోదావరి తీరాన్ని అభివృద్ధి చేయాలన్నదే ఈ ప్రణాళిక ఉద్దేశం.

సమగ్ర నివేదికతో కేంద్రానికి ప్రవేశపెట్టిన విజన్
ప్రాజెక్టు కోసం సమగ్రంగా తయారు చేసిన DPR (Detailed Project Report)ను కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కి సమర్పించినట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్ర సహకారం కోసం అన్ని దశలలో చొరవ తీసుకుంటున్నామని చెప్పారు.
టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం
కొందరి పనులకు టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించిన మంత్రి, వేగంగా పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారన్నారు. ఇందులో భాగంగా కడప జిల్లాలోని గండికోట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.గండికోటను గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ సంకల్పం స్పష్టం చేశారు. ఈ ప్రదేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్నదే లక్ష్యం అని మంత్రి వివరించారు.
బాపట్ల బీచ్ – జాతీయ స్థాయిలో అభివృద్ధి దిశగా
బాపట్లలోని సూర్యలంక బీచ్ను ప్రాధాన్యంతో అభివృద్ధి చేయాలని మంత్రి దుర్గేశ్ తెలిపారు. ఇది ఒక జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే, ఏపీ పర్యాటక రంగం కొత్త ఎత్తుకు చేరుతుంది. రాష్ట్రం అంతటా పర్యాటక హబ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ధృఢంగా కృషి చేస్తోంది.
Read Also : TTD : తిరుమలలో వేసవి రద్దీకి టీటీడీ పటిష్ట ఏర్పాట్లు