సచివాలయం : గోవాలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2025 ను నవంబర్ 20 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారని, ఇందులో ఎపి నుంచి ప్రత్యేక శకటం 20వ తేదిన నిర్వహించిన ప్రారంభోత్సవ పెరేడ్ లో ప్రదర్శించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. భారత ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రటరీ సంజయ్ జాజు ఆహ్వానం మేరకు 20 నవంబర్ 2025 నుండి గోవాలో ప్రారంభమైన అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రం నుండి 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టివి మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ నుండి మొట్టమొదటి సారిగా “ది హీయర్ బీట్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ టూరిజమ్” థీమ్తో ప్రత్యేక శకటం 20మంది డూప్ లైవ్ నటీనటులతో ప్రత్యేక ఆకర్ణణతో చిత్రోత్సవాల పెరేడ్ లో కనువిందు చేశాయన్నారు.
Read also: South Central Railway: ఇక ఇంటి వద్దకే రైల్వే పార్సిల్ డెలివరీ
Goa: Goa International Film Festival
రాష్ట్రంలోని సినిమా షూటింగ్ లోకేషన్లక సంబంధించిన ఛాయా చిత్రాలను గండికోట, అరకు, బొర్రా గుహలు, పాపికొండలు, లేపాక్షి నంది, క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి, ఎర్రమట్టి దిబ్బలు తదితర అందమైన అటవీ పర్యాటక ప్రాంతాలను శకటంలో ప్రదర్శించారన్నారు. ఈ చలన చిత్రోత్సవ వేడుకలకు తెలుగు సినిమా కథానాయకుడు, శాసనసభ్యులు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, నటి శ్రీలేఖ పాల్గొన్నారు. గోవా రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ముఖ్యమంత్రి, నేషనల్ ఫిలిండెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు జాతీయస్థాయి నటీ నటులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టివి మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ తరపున మేనేజర్ ఎం.శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ ప్రారంబోత్సవ వేడుకల్లో రాష్ట్ర శకటంతో పాటు కర్నాటక, గోవా, నేషనల్ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెందిన శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: