Garuda Varadhi: గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Read Time:  1 min
Garuda Varadhi
Garuda Varadhi
FONT SIZE
GET APP

తిరుపతి నగరంలోని గరుడ వారధిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో బైక్‌ను టిప్పర్ వాహనం ఢీకొట్టడంతో భగత్ సింగ్ నగర్‌కు చెందిన శ్యామల అనే మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాదం ఉదయం వేళ జరగడంతో అక్కడ కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Read also: Vijayawada: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కఠిన పోలీస్ ఆంక్షలు

Garuda Varadhi

Garuda Varadhi Accident

అదే బైక్‌పై ప్రయాణిస్తున్న రూప అనే మహిళ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తిరుపతి నగరంలో మరోసారి రోడ్డు భద్రతపై చర్చకు దారి తీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.