Garividi High School: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి ఉన్నత పాఠశాల కు చెందిన 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఈ నెల 5 నుండి 8 వరకు చిత్తూరు జిల్లాలో జరగనున్న రెజ్లింగ్ పోటీల్లో గరివిడి ఉన్నత పాఠశాల కు చెందిన కె. శ్రీనిధి,జి.కీర్తి, ఏ.వెంకట లక్ష్మీ, ఎం.భార్గవి,ని.రాకేష్, డి.రూప కుమార్, జి.రాజ్ కుమార్, సంగిరెడ్డి సాయి లు పాల్గొంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం.నిర్మల తెలిపారు.
Read Also: Gurukula School: ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు
కొండ గుంపాము లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో గరివిడి(Garividi High School) ఉన్నత పాఠశాల కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల పాఠశాల హెచ్ ఎం నిర్మల, ఆంగ్లోపాధ్యాయులు ఏ ఎస్ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు మొయిద ఉదయ్ కుమార్, సర్పంచ్ పి.ప్రమీల, ఉప సర్పంచ్ బమ్మిడి కార్తిక్, ఎస్.ఎం సి చైర్మన్ పల్లా రాంబాబు హర్షం వ్యక్తం చేసి విద్యార్థులను అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: