📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Latest News: Award: గంటేడ గౌరునాయుడుకు తాపీ ధర్మారావు పురస్కారం

Author Icon By Saritha
Updated: December 8, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ప్రముఖ కవి(Award) గంటేడ గౌరునాయుడుకు తాపీ ధర్మారావు నాయుడు పురస్కారం లభించింది. బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ 95 వార్షికోత్సవం గుంటూరు బ్రాడీపేటలోని కొరటాల సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ప్రముఖ కవి పుప్పాల శ్రీరామ్ సభకు అధ్యక్షత వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు బండికల్లు జమదగ్ని, ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు నాయుడు పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడుకు(Ganteda Gaurunaida) అందజేశారు.

Read also: డిప్యూటీ స్పీకర్ నియామకం ఇంకెప్పుడు?

Ganteda Gaurunaidou receives Tapi Dharma Rao Award

సాహిత్య, కళా రంగ సేవలకు ఘన సత్కారం

తాపీ ధర్మారావు(Award) సాహిత్య ప్రతిభను సాహితీవేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లు వివరించారు. పురస్కార గ్రహీత గంటేడ గౌరునాయుడు సాహిత్య ప్రస్థానాన్ని సాహితీ వేత్త ఎస్.ఎమ్. సుభానీ సభకు తెలియజేశారు. ఇటీవల నిర్వహించిన కథల పోటీల్లో బహుమతి పొందిన కథలను విశిష్ట అతిధి శిరంశెట్టి కాంతారావు విశ్లేషించారు. ఆత్మీయ అతిధులుగా విచ్చేసిన మల్లెతీగ పత్రిక సంపాదకులు కలిమిశ్రీ, విశాఖ సంస్కృతి పత్రిక సంపాదకులు శిరేల సన్యాసి రావు ఫౌండేషన్ సేవలను కొనియాడారు. అనంతరం కథల పోటీ విజేతలు నందిరాజు పద్మలతా జయరాం, వాడపల్లి పూర్ణ కామేశ్వరి, కైకాల సుమలతలను నగదు పురస్కారాలతో జమదగ్ని కుటుంబ సభ్యులు సత్కరించారు. వివిధ రంగాలలో సేవలందించిన వడ్రాణం హరిబాబు, డాక్టర్ గాజుల రామకృష్ణ, డాక్టర్ నెల్లూరి బ్రహ్మయ్య, నారదాసు శ్రీహరిరావు, బండ్లమూడి గాంధీ, బిళ్ళా అశోక్, మిరియాల గోపీ కుమార్, రామరాజు లక్ష్మీ శ్రీనివాస్, మేడిశెట్టి సుభద్రా కృష్ణ, ఉప్పు వెంకట రత్తయ్యలను స్ఫూర్తి పురస్కారాలతో సత్కరించారు. సభా ప్రారంభంలో నిర్వహించిన సంగీత విభావరి ఆహూతులను అలరించింది. నగరానికి చెందిన కవులూ, రచయితలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AndhraPradesh Awards BandikalluVenkateshwarluFoundation culturalevent GantedGaurunayudu Guntur Latest News in Telugu literature poetry poets Storytelling TapiDharmaraoAward writers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.