ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt), మైనారిటీ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్తను అందించింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మైనారిటీ విద్యార్థులకు ఉచిత టెట్ (TET) కోచింగ్ ఇవ్వనున్నట్లు మైనారిటీ సంక్షేమ,శాఖ మంత్రి ఫరూక్ (Minister Farooq) ప్రకటించారు. ఈ శిక్షణ ద్వారా రాష్ట్రంలోని మైనారిటీ అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశాన్ని పొందనున్నారు.
Read Also: CBSE Exam: సీబీఎస్ఈ 10, 12 తరగతి పరీక్షల టైం టేబుల్
మంత్రి ఫరూక్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) ద్వారా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కేంద్రం వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంలో విశేష ఫలితాలు సాధించింది. ఇప్పుడు టెట్ పరీక్ష కోసం ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం మైనారిటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా తీసుకున్న ముఖ్యమైన అడుగుగా భావించబడుతోంది.తమ వివరాలను https://apcedmmwd.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: