Latest News: Amaravati: అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

Read Time:  1 min
Latest News: Amaravati: అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
FONT SIZE
GET APP

రాజధాని అమరావతి (Amaravati) లో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్‌, పొంగూరు నారాయణ హాజరయ్యారు. (Amaravati) రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన ఉన్న సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Read Also: Bhimavaram Crime: సైబర్ క్రైమ్ లో 42 లక్షలు నగదు రికవరీ

Foundation stone laid for 15 banks in Amaravati
Foundation stone laid for 15 banks in Amaravati

6,514 మందికి ఉద్యోగ అవకాశాలు!

ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా సుమారు 6,514 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఏపీసీఆర్డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చారిత్రక కార్యక్రమంలో రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అమరావతిలో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్న వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, నాబార్డ్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ వంటి ప్రముఖ జాతీయ సంస్థలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.