Chandrababu: కొత్త జిల్లాలపై దృష్టి: నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం

Read Time:  1 min
Chandrababu
Chandrababu
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు మరియు ఇప్పటికే ఉన్న జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల అవసరం, రెవెన్యూ డివిజన్ల(Revenue Divisions)లో మార్పులు, పరిపాలన మరింత సులభం అయ్యే విధానాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరుగనుంది.

Read Also:  T20 Blind World Cup: ప్రపంచకప్‌ విజేతగా టీమిండియా..మెరిసిన ఇద్దరు తెలుగమ్మాయిలు

Focus on new districts CM Chandrababu holds key meeting today

కొత్త జిల్లాల సృష్టిపై భౌగోళిక స్థితిగతులు

ఇప్పటికే జిల్లాల రీ-ఆర్గనైజేషన్ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మొదటి రౌండ్ చర్చలు నిర్వహించి పలు ప్రతిపాదనలను పరిశీలించింది. ముఖ్యంగా మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాల సృష్టిపై భౌగోళిక స్థితిగతులు, పరిపాలనా అవసరాలపై లోతైన అధ్యయనం చేశారు. ఉపసంఘం తమ ప్రాథమిక నివేదికను ఇటీవలే ముఖ్యమంత్రికి అందజేసింది.

ఈ నేపథ్యంలో నేడు ఉపసంఘం మరోసారి సీఎం చంద్రబాబుతో సమావేశం కానుంది. ప్రజల అభ్యర్థనలు, పరిపాలన సౌకర్యం, ప్రాంతీయ(Regional) అవసరాలను పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సమీక్ష తర్వాత ఈ నెల 28వ తేదీ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం వచ్చే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ వ్యూహం అమలు అవుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.