Breaking News: Fine: ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు JAN 5 వరకు గడువు

Read Time:  1 min
Fine
Fine
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం గత నెలలోనే ఫీజు చెల్లింపు గడువు ముగిసినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తత్కాల్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. జనరల్, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు(Fine) రూ.5,000 ఫైన్‌తో పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఈ సదవకాశాన్ని ఈ నెల 22 నుంచి జనవరి 5 వరకు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. నిర్ణయించిన తేదీల తర్వాత ఎలాంటి అదనపు అవకాశం ఉండదని కూడా హెచ్చరించింది. పరీక్ష ఫీజు చెల్లించని(Fine) కారణంగా అనేక మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేకపోయే పరిస్థితి ఏర్పడకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read also: ప్రజల జీవన ప్రమాణాలు పెరిగా: ఆర్బీఐ నివేదికే

Fine
Intermediate students who have not paid their fees have been given a deadline until January 5th.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.