శిక్ష పూర్తయినా, బెయిల్ మంజూరయినా కోర్టులు విధించిన ఆర్థిక పూచీకత్తులు లేదా జరిమానాలు చెల్లించలేక జైళ్లలోనే మగ్గుతున్న నిరుపేద ఖైదీలకు(prisoners) సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఒక ప్రత్యేక పథకాన్ని (Support to Poor Prisoners Scheme) తీసుకొచ్చింది. జైళ్లపై సామర్థ్యానికి మించి భారం తగ్గించడం, పేద ఖైదీలకు సాయం చేయడం ఈ పథకం లక్ష్యం. అయితే, అర్హులైన ఖైదీలను గుర్తించడంలో రాష్ట్రాల అధికార యంత్రాంగాలు తగిన చొరవ చూపకపోవడంతో, కేంద్రం వద్ద పుష్కలంగా నిధులు ఉన్నా ఈ పథకం సరిగా వినియోగపడటం లేదు.
Read Also: TG: ములుగు అడవుల్లో గణనీయంగా పెరిగిన సీతాకోకచిలుకల సంఖ్య

తెలుగు రాష్ట్రాల్లో దయనీయ స్థితి
ఈ పథకం అమలులో తెలుగు రాష్ట్రాల పనితీరు దయనీయంగా ఉంది.
- ఆంధ్రప్రదేశ్: గత మూడేళ్లుగా (2023-24, 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలు) ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోలేదు.
- తెలంగాణ: 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఐదుగురు మాత్రమే లబ్ధి పొందారు.
దేశవ్యాప్తంగా చూస్తే, 2023-24లో 17 మంది, 2024-25లో 93 మంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (జులై వరకు) 34 మంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని మెరుగ్గా ఉపయోగిస్తున్నాయి. నిధులు ఉన్నప్పటికీ వినియోగించుకోవడం లేదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలంటూ కేంద్ర హోం శాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది.
పథకం ప్రయోజనాలు, అనర్హులు
ఈ పథకం కింద ఖైదీ ఆర్థిక పరిస్థితులను కమిటీ పరిశీలిస్తుంది.
- బెయిల్ పూచీకత్తు: అర్హులుగా తేలితే, బెయిల్ మంజూరు కోసం రూ. 40 వేల వరకు ఆర్థిక పూచీకత్తు ఇస్తారు. జిల్లా స్థాయిలో సాధికార కమిటీ ఆమోదం తర్వాత, సెంట్రల్ నోడల్ ఏజెన్సీ ఖాతా నుంచి జిల్లా కలెక్టర్లే నేరుగా సొమ్మును కోర్టుకు సమర్పిస్తారు.
- జరిమానాలు: శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకైతే జరిమానా సొమ్ము రూ. 25 వేల వరకు చెల్లించడానికి కమిటీ ఆమోదం తెలుపుతుంది. అంతకంటే ఎక్కువ మొత్తంపై రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
- అనర్హులు: అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, మాదకద్రవ్యాల నిరోధక చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల నియంత్రణ చట్టం (ఉపా-UAPA) కేసుల్లో అరెస్ట్ అయిన ఖైదీలు ఈ పథకానికి అర్హులు కారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: