📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Festival – వైభవోపేతం.. కాణిపాకం రథోత్సవం – పోటెత్తిన భక్తజనం

Author Icon By Shravan
Updated: September 4, 2025 • 2:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాణిపాకం Festival : కాణిపాకం దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారికి రథోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఈ మేరకు వేకువజామున దేవస్థానం వారిచే అర్చకస్వాములు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి సర్వాంగసుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉభయదారులు వరుస ఉభయం తీసుకురాగా సిద్ధి బుద్ధి సమేత గణనాధుని ఉత్సవమూర్తులను అలంకార మండపంలో ఉంచి అలంకరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో రథయాత్ర

ఉదయం 10 గంటలకు ఉత్సవమూర్తులను ఆలయం నుండి తీసుకువచ్చి రథంపై ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గణేష్ నామస్మరణల నడుమ రథాన్ని భక్తులు లాగి వదిలిపెట్టారు. ఈ సందర్భంగా భక్తులు నారికేళ కర్పూర హారతులు సమర్పించి, బొరుగులు, మిరియాలు, ఉప్పు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు పిండి తలిగలు వేసి మొక్కులు తీర్చుకోవడం విశేషం. ఈ ఉత్సవం Spiritual Festivities కి నిదర్శనం.

Festival – వైభవోపేతం.. కాణిపాకం రథోత్సవం – పోటెత్తిన భక్తజనం

భక్తజన సందడి మరియు భద్రతా ఏర్పాట్లు

మధ్యాహ్నం 3 గంటలకు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, పలు సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటాలు, నృత్యాలు, పిల్లనగ్రోవి వంటి వైవిధ్యభరిత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. రథోత్సవాన్ని వీక్షించడానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అశేష భక్తజనంతో కాణిపాకం వీధులన్నీ కిక్కిరిశాయి. ఆలయం పుష్పాలతో శోభాయమానంగా అలంకరించబడింది. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ Security Arrangements అమలు చేశారు.

కాణిపాకం రథోత్సవం ప్రత్యేకత ఏమిటి?
స్వామివారి ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్టించి భక్తుల గణేష్ నామస్మరణల నడుమ ఊరేగించడం ఈ ఉత్సవం ప్రత్యేకత.

రథోత్సవంలో ఏ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి?
కోలాటాలు, పిల్లనగ్రోవి, వివిధ రకాల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/author-famous-writer-koka-vimala-kumari-passes-away/andhra-pradesh/541138/

Breaking News in Telugu Chittoor District News Devotees Gathering Hindu Festivals Kanipakam Rathotsavam Kanipakam Temple Latest News in Telugu Rathotsavam Festival Telugu News Today Temple Festivals India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.