📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Today News : Festival – దుర్గమ్మ ఆలయంలో దసరాకు పకడ్బందీ ఏర్పాట్లు

Author Icon By Shravan
Updated: September 4, 2025 • 2:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంద్రకీలాద్రి Festival : దుర్గమ్మ ఆలయంలో ఈ ఏడాది జరగబోయే దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. బుధవారం ఆయన దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లకు సింహాచలం దేవస్థానం నుండి తెప్పించిన Queue Frames ను వినియోగిస్తున్నారు. పోటు నిర్మాణంలో పలు సూచనలు చేశారు. పలు చోట్ల దసరా కోసం చేస్తున్న పెయింటింగ్లు పరిశీలించారు. అన్నదాన భవనం నాణ్యతతో పనులు సాగాలన్నారు. ఎలివేటెడ్ క్యూలైన్ల నిర్మాణం పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ భక్తులకు మెరుగైన దర్శనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

దాతల విరాళాలు & సేవా కార్యక్రమాలు

దుర్గమ్మ వారి ఆలయంలో జరిగే నిత్యాన్నదాన పథకానికి రూ. 2 లక్షల విరాళాన్ని మచిలీపట్నంకు చెందిన సర్వ కృష్ణమోహన్ ప్రసాద్ దంపతులు బుధవారం విరాళంగా అందించారు. అలాగే విజయవాడకు చెందిన విశ్వశ్రీ ప్రాజెక్టు, ఆరోఫామ్స్ ప్రై లిమిటెడ్ యాజమాని చింత శివ రామకృష్ణ రూ. 1,00,116ల విరాళాన్ని అందించారు. దాతలకు దుర్గమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసిన అనంతరం శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటో అందించారు.

Festival – దుర్గమ్మ ఆలయంలో దసరాకు పకడ్బందీ ఏర్పాట్లు

వేదాశీర్వచనాలు & ప్రత్యేక గౌరవాలు

దాతలకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. ఆలయంలో జరుగుతున్న అన్నదాన పథకానికి భక్తుల విరాళాలు సమర్పించడంతో సేవా కార్యక్రమాలు మరింత బలపడుతున్నాయి. దసరా ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆలయ అధికారులు Temple Management లో పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

దసరా ఉత్సవాల కోసం ఆలయంలో ఏ సౌకర్యాలు అందిస్తున్నారు?
భక్తుల సౌకర్యం కోసం ఎలివేటెడ్ క్యూలైన్లు, క్యూఫ్రేమ్‌లు, పోటు నిర్మాణం, పెయింటింగ్‌లు వంటి పలు పనులు చేపట్టారు.

నిత్యాన్నదాన పథకానికి ఎవరు విరాళాలు అందించారు?
మచిలీపట్నంకు చెందిన సర్వ కృష్ణమోహన్ ప్రసాద్ దంపతులు రూ. 2 లక్షలు, చింత శివ రామకృష్ణ రూ. 1,00,116 విరాళాలు అందించారు.

Read hindi news : hindi.vaartha.com

Read also :

https://vaartha.com/bjp-should-be-made-a-strong-party-in-every-village/andhra-pradesh/541117/

Andhra Pradesh Temples Breaking News in Telugu dasara Devotees Durga Temple Festival Preparations Indian Festivals Kanaka Durga Temple Latest News in Telugu Navaratri Telugu News Today temple arrangements Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.