📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Liquor case: జోగి రమేశ్ చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు

Author Icon By Saritha
Updated: October 25, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిట్ విచారణలో కీలక మలుపు

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన నకిలీ(Liquor case) మద్యం కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధనరావు (A1) విచారణ సందర్భంగా మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్ పేరును ప్రస్తావించినట్లు సమాచారం. సిట్ అధికారులు ఏడు రోజుల కస్టడీ భాగంగా జనార్ధనరావు మరియు జగన్మోహనరావులను నెల్లూరు, విజయవాడ జైళ్ల నుండి తూర్పు ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి విచారించారు. ఈ విచారణలో జనార్ధనరావు, జోగి రమేశ్(Jogi Ramesh) ప్రలోభాలకు లోనై నకిలీ మద్యం వ్యాపారంలోకి ప్రవేశించానని వెల్లడించినట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు జోగి రూ.3 కోట్లు సహాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించారని ఆయన వెల్లడించారు.

Read also: యువతిపై అత్యాచార యత్నం.. ప్రతిఘటించిందని చంపిన నిందితుడు

Liquor case: జోగి రమేశ్ చుట్టు బిగుసుకుంటున్న ఉచ్చు

జోగి రమేశ్‌పై ఆరోపణలు తీవ్రం

జనార్ధనరావు చెప్పిన ప్రకారం, ములకలచెరువులో నకిలీ(Liquor case) మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి, దానివల్ల అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబును బద్నాం చేయాలని జోగి సూచించాడని పేర్కొన్నాడు. అంతేకాకుండా, వైసీపీ ప్రభుత్వ కాలంలో కూడా జోగితో కలిసి అక్రమ మద్యం వ్యాపారం చేసినట్లు వివరించాడు.

ఎన్నికల సమయాన నిఘా పెరగడంతో ఆ వ్యాపారాన్ని నిలిపివేసినట్లు కూడా వెల్లడించాడు. ఆఫ్రికా వెళ్లే ముందు రోజు ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసినట్లు, ఆ తర్వాత ఆయన సహాయకులు ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలోని తయారీ కేంద్రాల సమాచారాన్ని అధికారులకు అందించారని తెలిపాడు.ఈ వివరాలతో సిట్ అధికారులు జోగి రమేశ్ పాత్రపై మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. కేసులో ఆయనపై ఆరోపణలు బలపడడంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh fake liquor case Janardhana Rao jogi ramesh Latest News in Telugu Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.