📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Facial Recognition : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

Author Icon By Shravan
Updated: August 2, 2025 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి శుక్రవారం నుంచి పేస్ రికగ్నేషన్ (Facial Recognition) అటెండెన్స్ (ముఖ గుర్తింపు హాజరు) ప్రారంభమైంది. ఇప్పటికే దీనిని గత ఏడాది డిసెంబర్ లో పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి జిల్లాలో ప్రారం భించగా.. ఆగస్టు 1(శుక్రవారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని పాఠశాల విద్య శాఖ నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ గుర్తింపు హాజరును మొదటిరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 93 శాతం హాజరు ప్రారంభించినట్టు పాఠశాల విద్య శాఖ అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ తన పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులతోపాటు బోధనేతర సిబ్బందికి శుక్రవారం నుండి ముఖ గుర్తింపు హాజరును అమల్లోకి తీసుకొచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.

విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 24973 ఉండగా అందులో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కలిపి 1,28,760 మంది ఉన్నారని తెలిపారు. వారిలో శుక్రవారం ముఖము గుర్తింపు హాజరు ఆప్ ద్వారా 96,327 (75శాతం) మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 89,922 (93.3శాతం) మంది తమ హాజరును ముఖ గుర్తింపు హాజరు యాప్ ద్వారా నమోదు చేయడం జరిగిందని అధికారులు ప్రకటించారు.

READ MORE :

https://vaartha.com/liquor-scam-liquor-scam-drama-with-chandrababus-corruption-filing-sajjala-ramakrishna-reddy/andhra-pradesh/524773/

attendance system Breaking News in Telugu education tech Facial Recognition Google News in Telugu Govt Schools Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.