📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం

Author Icon By Sudheer
Updated: February 12, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అగ్నిప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది

ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని సితార్ సెంటర్ కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం దాటికి ఎగ్జిబిషన్ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు భయంతో పరుగులు పెట్టారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఎగ్జిబిషన్‌ లో అనేక మంది సందర్శకులు ఉన్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగినప్పటికీ, మంటలను అదుపులోకి తేవడం కొంతసమయం పట్టింది. గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ అగ్నిప్రమాదం వల్ల భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఎగ్జిబిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్, వాణిజ్య వస్తువులు మొత్తం మంటల్లో చిక్కుకుని నాశనమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత సీఐడీ, ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందా? లేదా ఏ ఇతర కారణం ఉండదా అన్నది పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తి అయిన తర్వాత తేలనున్నట్లు అధికారులు తెలిపారు.

మరోఘటనలో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి ఇంజిన్ పూర్తిగా కాలిపోయిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు నుంచి పల్నాడు జిల్లాలోని క్రోసూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లో వ్యాపించి ఇంజిన్‌ పూర్తిగా కాలిపోయింది. అయితే ఈ ఘటనలో.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

fire accident Google news Kashmir Jalakanya exhibition Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.