📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్

Ex Minister Roja : చిక్కుల్లో మాజీ మంత్రి రోజా!

Author Icon By Shravan
Updated: August 11, 2025 • 9:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆడుదాం ఆంధ్ర పై విచారణ పూర్తి రేపో, మాపో డిజిపికి నివేదిక

విజయవాడ : వైఎస్సార్సీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తియ్యింది. ఈ నివేదికను ఒకటి రెండు రోజుల్లో డిజిపికి అందచేయనున్నట్లు విజిలెన్స్ విభాగం అధికారుల వర్గాల సమాచారం.. వైఎస్సార్సీ హయాంలో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలను టిడిపి. బిజెపి, జనసేన వర్గాలు చేస్తున్నాయి. క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీ నిధులు దుర్వినియోగం చేశారనే అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కె రోజా (Ex Minister Roja) పాత్ర ఉందని టిడిపి నేతలు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది’. ‘ఆడుదాం ఆంధ్రా’లో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలను విజిలెన్స్ విభాగం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక లోని అంశాల ఆధారంగా భాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వైఎస్సార్సీ పరిపాలనసాగించిన చివరిఏడాదిలో ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడలను నిర్వహించి… అందులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు టిడిపి నేతలు ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే దీనిపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమం పేరుతో స్పోర్ట్స్ కిట్లు, యాప్, టీ షర్టులు, బ్రోచర్లు, క్రీడల నిర్వహణ, రవాణా, ఫుడ్ అండ్ ప్రైజ్ మనీ, ముగింపు రోజు ఏర్పాట్లు… ఇలా మొత్తం (Rs. 119 crores spent) చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అప్పటి మంత్రి రోజా, నాటి శాప్ చైర్మన్ సిథార్ధరెడ్డి చెప్పిన వారికి వర్కర్ ఆర్డర్లు, నచ్చిన వారికి ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా భారీగా వెనకేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆడుదాం ఆంధ్రాలో చేసిన అవినీతిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని.. ఆగస్టు 10 తర్వాత మాజీ మహిళా మంత్రి ఏ క్షణంలోనైనా అరెస్ట్ కావచ్చన్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు ఆంధ్రాలో జరిగిన స్కాంపై… నేడో… రేపో విజిలెన్స్ విభాగం అధఙ్ఞకారులు డిజిపికి నివేదిక సమర్పించనున్నారు. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం మూలాలను వెలికి తీసినట్లు సమాచారం. నివేదికలో అంశాలఆధారంగా ప్రభుత్వం.. భాధ్యులపై చర్యలు తీసుకోనుంది. రూ.19 కోట్లతో వైఎస్సార్సీ ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా దోచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేసింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/pre-release-event-hyderabad-buzzes-with-memories-of-ntrs-first-fan/cinema/528672/

Breaking News in Telugu Ex Minister Roja Former Minister Roja Latest News in Telugu Roja Latest Update Roja Trouble News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.