ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల రంగానికి మరొక పెద్ద శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ (EMC) పథకం కింద రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ (Electronics industry) స్థాపనకు ఆమోదం లభించింది. రూ. 765 కోట్ల పెట్టుబడితో ఏర్పడనున్న ఈ యూనిట్, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి మరో కొత్త ఊపిరిని తీసుకొస్తుంది. ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 955 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.
Read Also: Rain Alert: తీరం దాటబోతున్న మొంథా – కోస్తాంధ్ర ప్రజలకు అలర్ట్
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించిన వివరాల ప్రకారం, మూడు రాష్ట్రాల్లో మొత్తం 7 ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల విలువ రూ. 5,500 కోట్లు, వీటి ద్వారా 36,559 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు (Electronics industry) తయారు చేయబడతాయి. అదేవిధంగా, మొత్తం 5,100 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: