TDP MP Drugs Issue: మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పేరు బయటకు రావడం, ఆయనకు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
Read Also: Polavaram Funds: పోలవరం పనుల కోసం నిధులు విడుదల!
ఎంపీ పుట్టా మహేశ్కు స్టేషన్ బెయిల్.. డ్రగ్స్ పాజిటివ్ అని నిర్ధారణ!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆయనకు నోటీసులు జారీ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసినట్లు తెలుస్తోంది. మహేశ్తో పాటు మరో నిందితురాలు ప్రియాంక రెడ్డికి కూడా బెయిల్ లభించింది.
TDP MP Drugs Issue: పరీక్షల్లో షాకింగ్ నిజాలు: ఆరుగురికి పాజిటివ్!
పోలీసుల దర్యాప్తులో అత్యంత విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పట్టుబడిన నిందితులకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేశ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. ఈగల్ టీమ్ ఈ కేసును వేగవంతం చేసి, మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అసలు ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
చంద్రబాబు సీరియస్: ఎంపీకి షోకాజ్ నోటీసులు
మరోవైపు, తన పార్టీ ఎంపీపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కఠినంగా స్పందించారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఇటువంటి చర్యలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వెంటనే పుట్టా మహేశ్ను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టాలని ఆదేశిస్తూ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేత షోకాజ్ నోటీసులు జారీ చేయించారు. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని హైకమాండ్ ఆదేశించింది.
TDP MP Drugs Issue: తప్పు చేయలేదు.. వీడియో విడుదల చేసిన ఎంపీ
అయితే, తనపై వస్తున్న ఆరోపణలను పుట్టా మహేశ్ తోసిపుచ్చారు. తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “నేను ఎలాంటి తప్పు చేయలేదు. కొందరు మిత్రులు ఆహ్వానిస్తేనే ఆ డిన్నర్కు వెళ్ళాను. ఏలూరు ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను” అని పేర్కొన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: