📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Eluru District: కూల్‌డ్రింక్‌ అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి..

Author Icon By Saritha
Updated: March 12, 2026 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Eluru District: తల్లిదండ్రుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో కూల్‌డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగిన ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

Read Also: LPG Shortage : స్విగ్గీ, జొమాటో బంద్..! ఏపీలో హోటల్స్ సంచలన

నిర్ణయాలు..!

Eluru District: Child drinks pesticide thinking it was a cool drink..

చికిత్స పొందుతూ మృతి

బుట్టాయగూడెం మండలం మర్రిగూడేనికి చెందిన పూనెం నాగేంద్రబాబు, కుమారి దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో మంగళవారం కూడా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో తన భర్తను బెదిరించేందుకు భార్య కుమారి పొగాకు తోటకు చల్లే జిడ్డుమందు కూల్డ్రింక్ సీసాలో తెచ్చి ఇంటివద్ద కంచెకు పెట్టింది. దురదృష్టవశాత్తూ, ఆ సీసాలో ఉన్నది పురుగుల మందు అని తెలియక, అది కూల్‌డ్రింక్ అనుకొని వారి ఐదేళ్ల కుమార్తె తాగేసింది.

వెంటనే అస్వస్థతకు గురైన చిన్నారిని చూసి కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, మందు ప్రభావం తీవ్రంగా ఉండటంతో పరిస్థితి విషమించి బుధవారం ఆ చిన్నారి మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Buttaigudem mandal tragedy child drinking pesticide by mistake Eluru district impact on children parent disputes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.