हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Electricity Charges : భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీల పెంచం – చంద్రబాబు

Sudheer
Electricity Charges : భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీల పెంచం – చంద్రబాబు

విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక(Prajavedika)లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలను పెంచే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. గత పాలకులు ‘ట్రూ అప్’ ఛార్జీల రూపంలో ప్రజలపై ₹32 వేల కోట్ల భారాన్ని మోపారని, కానీ తాము ఆ భారాన్ని తగ్గిస్తూ విద్యుత్‌ ఛార్జీలను క్రమంగా తగ్గిస్తున్నామని చెప్పారు. ఇది వినియోగదారులకు ఊరట కలిగించడమే కాకుండా పరిశ్రమలకు కూడా ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.

Dasara: దసరా వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ !

సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తన ప్రసంగంలో దత్తి గ్రామంలోని ప్రతి కుటుంబానికి సుమారు రూ. 2.20 లక్షల లబ్ధి సంక్షేమ పథకాల ద్వారా అందిందని వివరించారు. పింఛన్లు, ఇళ్లు, రేషన్‌, ఆరోగ్య పథకాల రూపంలో ప్రభుత్వ సహాయం గ్రామ స్థాయిలోనే ప్రత్యక్ష ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు. ఈ విధంగా సమగ్ర సంక్షేమం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా చైతన్యం వస్తుందని చెప్పారు.

విజయనగరం జిల్లాలోని దత్తి ప్రాంతం సమీపంలో ఉన్న ట్రైబల్ యూనివర్సిటీ పక్కనే త్వరలో గ్రేహౌండ్స్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇది గిరిజన ప్రాంతాల్లో భద్రత, శాంతి భద్రతల బలోపేతానికి తోడ్పడుతుందని చెప్పారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరంగా మార్చకుండా కాపాడామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు అభివృద్ధి, భద్రత, పరిశ్రమల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సూచిస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870