📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్

Author Icon By Divya Vani M
Updated: March 7, 2025 • 7:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ సెమిస్టర్ పరీక్షా పత్రం లీకేజీ వివాదం విద్యా రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు పేపర్ బయటకు వచ్చేసిన వార్త విస్తృత చర్చకు దారి తీసింది.ఈ ఘటనపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా స్పందించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేపర్ లీక్ గురించి తెలుసుకున్న వెంటనే ఉన్నత విద్యా శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. విచారణను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించడంతో పాటు పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసిన విద్యాశాఖ నారా లోకేశ్

విద్యార్థుల హితాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు. లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరలికాకుండా పరీక్షల నిర్వహణ విధానాన్ని మరింత కఠినతరం చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రశ్నాపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, తద్వారా ఈ తరహా సమస్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై పరీక్షా పత్రాల భద్రతను మరింత పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వివాదం ఏ విధంగా పరిష్కారం అవుతుందో చూడాలి.

ANU_BEd_PaperLeak EducationNews EducationScandal ExamSecurity NaraLokesh PaperLeakIssue

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.