📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Dussehra – ఉత్సవాల ఏర్పాట్లు సెప్టెంబర్ 15 నాటికి పూర్తి

Author Icon By Shravan
Updated: August 26, 2025 • 2:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంద్రకీలాద్రి Dussehra : దుర్గమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల (Dussehra celebrations) ఏర్పాట్లు సెప్టెంబర్ 15కల్లా పూర్తి చేయాలని ఇఓ వికె శీనా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల వివరాల పురోగతిని తెలుసుకున్నారు. కమీషనర్ ఆదేశాల మేరకు నూతన లడ్డూపోటులో లడ్డూ తయారీ చేయాలన్నారు. నూతన అన్నదాన (Annadana) భవనంలో అన్నదానం జరగాలన్నారు. దసరా ప్రత్యేక పూజలు కుంకుమార్చన, దేవిఖడ్గమాల, శ్రీచక్రనవణార్చనలు మహామండపం 6వ అంతస్థులో జరుగుతాయన్నారు. చండీహోమం యాగశాలలో జరుగుతాయన్నారు. అన్ని పూజల టికెట్లు ఆన్లైన్లో కొనుగోలు చేయాలన్నారు. టికెట్లు అందుబాటులో వుంచే వివరాలు త్వరలో తెలుపుతామన్నారు. భక్తులకు ఉదయం 6 నుండి 10.30 వరకు పులిహోర, కట్టుపొంగలి, కదంబం, దద్దోజనం అందిస్తామని, ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 వరకు భోజనం, సాయంత్రం 4 నుండి రాత్రి 9.30 వరకు పులిహోర, కదంబం కొండ దిగువన అందించాలని, మూలానక్షత్రం రోజున విజయదశమి రోజున చిన్న లడ్డూ ఉచితంగా అందింస్తామన్నారు.

Dussehra – ఉత్సవాల ఏర్పాట్లు సెప్టెంబర్ 15 నాటికి పూర్తి

కనకదుర్గమ్మ ఆలయానికి భారీ విరాళాలు

సమీక్ష సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ రంగారావు, ఇఇ లు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఇఓ చంద్రశేఖర్, సుధారాణి, గంగాధర్, రమేష్ బాబు, శ్రీనివాస్, తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దుర్గమ్మ వారి లయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు యు లక్ష్మిపార్వతి 5.1,00,1010 విరాళాన్ని సోమవారం తమ భర్త వెంకటేశ్వరరావు పేరిట నిత్యాన్నదాన పథకానికి అందించారు. విజయవాడకు చెందిన ఎస్ కృష్ణ, అనంతలక్ష్మి దంపతులు రు.1లక్ష విరాళాన్ని కనకదుర్గ డెవలెప్మెంట్ ట్రస్టుకు అందించారు. దాతలకు దుర్గమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు అనంతరం వారికి దుర్గమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం, మెమొంటోలను అందించారు. శ్రీ కనకదుర్గానగర్ నుండి మహామండపం వరకు బిటి రోడ్ పనులు సోమవారం ప్రారంభమైన సందర్భంగా వాహ నాలకు ప్రవేశం లేదని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు. వాహనదారులు ఘాట్రోడ్డు మార్గం లో కొండపైకి చేరుకోవాలన్నారు. దుర్గమ్మ వారిని దర్శించుకునే భక్తులు పోన్లను మొబైల్ కౌంటర్లలో భద్రపరుచుకోవాలన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/tirumala-there-are-protests-over-the-continuation-of-offline-publication/andhra-pradesh/536264/

Breaking News in Telugu celebrations Festival Arrangements Festival Preparations Latest News in Telugu Navratri 2025 Telangana news Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.