కర్నూలులోని టెస్టింగ్ రేంజ్లో డీఆర్డీఓ డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం (Missile launch by drone) విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని రాష్ట్ర గౌరవంగా అభివర్ణించారు.రక్షణ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR)లో జరిగిన ఈ విజయం దేశ రక్షణ శక్తిని పెంచుతుందని పేర్కొన్నారు.
శాస్త్రవేత్తలకు సీఎం అభినందనలు
యూఏవీ-లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (ULPGM-V3) పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది భారత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే ముఖ్యమైన ముందడుగని ఆయన అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి పెద్ద అడుగు
ULPGM-V3 విజయం స్వదేశీ సాంకేతికత బలోపేతానికి సూచికగా నిలిచిందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ భావజాలాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేయగా, చంద్రబాబు ఆ ట్వీట్ను రీట్వీట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.ఈ ఘట్టం దేశ రక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతను మరోసారి రుజువు చేసిందని ఆయన అన్నారు.
Read Also : AP Metro Rail : మెట్రో ప్రాజెక్టులపై మంత్రి నారాయణ కీలక ప్రకటన