📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Fertilizers : ఎరువుల పంపిణిలో సమస్యలు రానివ్వొద్దు – మంత్రి అచ్చెన్నాయుడు

Author Icon By Shravan
Updated: August 19, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఎరువుల (Fertilizers) సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వ కుండా, ప్రణాళిక బద్ధంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ అధికారులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ సజావుగా సాగుతున్నాకూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుసుకున్న మంత్రి విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయశాఖ కమిషనర్ ఢిల్లీ రావు, మార్క్ ఫెడ్ ఎండీ మనజీర్ జిలాని సామున్, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు మొత్తం 16.73 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా ఉందని, వాటిలో యూరియా 6.22 లక్షల మెట్రిక్టన్నులు, డిఎపి 2.60 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపి 0.70 లక్షల మెట్రిక్ టన్నులు, యస్వాస్పి 0.94 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు-6.30లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని కమిషనర్ ఢిల్లీరావు మంత్రికి వివరించారు. కేంద్రం నుండి ఆగస్ట్ నెలకు సంబంధించి రావల్సిన ఎరువులు రాష్ట్రానికి సరైన సమయంలో అందలేదని దాంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో రైతులకు ఎరువుల సరఫరా

రాష్ట్రానికి ఇప్పటివరకు 10.39 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయని, ప్రారంభనిల్వలు 7.13 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం 17.53 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను రాష్ట్రంలోని రైతులకు అందుబాటులో ఉంచామని, 10.96 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందచేశామని, 6.56 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు తెలిపారు.

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులను రైతులకు (Farmers) సకాలంలో అందచేశాం, అయినా కూడా పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఎరువులు ఆర్ ఎఫ్ సీ రామగుండం నుండి 19,000 మెట్రిక్ టన్నులు, కాకినాడ పోర్ట్ కు రావాల్సిన ఎరువులు కనీసం 30,000 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్ట్కు రావాల్సిన 18,500 మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపడతామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. యూరియా కొరత కావాలని సృష్టిస్తే ఎవరిని ఉపేక్షించమని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/liquor-policy-new-liquor-policy-to-be-implemented/andhra-pradesh/532381/

Andhra Pradesh agriculture Breaking News in Telugu Farmers Welfare Fertilizer Distribution Fertilizer Supply Issues Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.