విజయవాడ : ఎరువుల (Fertilizers) సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వ కుండా, ప్రణాళిక బద్ధంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ అధికారులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ సజావుగా సాగుతున్నాకూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుసుకున్న మంత్రి విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయశాఖ కమిషనర్ ఢిల్లీ రావు, మార్క్ ఫెడ్ ఎండీ మనజీర్ జిలాని సామున్, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు మొత్తం 16.73 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా ఉందని, వాటిలో యూరియా 6.22 లక్షల మెట్రిక్టన్నులు, డిఎపి 2.60 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపి 0.70 లక్షల మెట్రిక్ టన్నులు, యస్వాస్పి 0.94 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు-6.30లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉందని కమిషనర్ ఢిల్లీరావు మంత్రికి వివరించారు. కేంద్రం నుండి ఆగస్ట్ నెలకు సంబంధించి రావల్సిన ఎరువులు రాష్ట్రానికి సరైన సమయంలో అందలేదని దాంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో రైతులకు ఎరువుల సరఫరా
రాష్ట్రానికి ఇప్పటివరకు 10.39 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయని, ప్రారంభనిల్వలు 7.13 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం 17.53 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను రాష్ట్రంలోని రైతులకు అందుబాటులో ఉంచామని, 10.96 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందచేశామని, 6.56 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రికి అధికారులు తెలిపారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులను రైతులకు (Farmers) సకాలంలో అందచేశాం, అయినా కూడా పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఎరువులు ఆర్ ఎఫ్ సీ రామగుండం నుండి 19,000 మెట్రిక్ టన్నులు, కాకినాడ పోర్ట్ కు రావాల్సిన ఎరువులు కనీసం 30,000 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్ట్కు రావాల్సిన 18,500 మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపడతామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. యూరియా కొరత కావాలని సృష్టిస్తే ఎవరిని ఉపేక్షించమని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :