Breaking News – Montha Toofan Effect: ఇళ్ల నుంచి బయటికి రావొద్దు – మంత్రి అనిత

Read Time:  1 min
Breaking News – Montha Toofan Effect: ఇళ్ల నుంచి బయటికి రావొద్దు – మంత్రి అనిత
FONT SIZE
GET APP

మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిస్తూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. తుఫాన్ సమయంలో బలమైన ఈదురు గాలులు, కుండపోత వర్షాలు సంభవిస్తాయని హెచ్చరికలు రావడంతో రోడ్లపై చెట్లు, స్తంభాలు కూలే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి ప్రభుత్వం పలు ముందస్తు చర్యలు చేపట్టింది.

Latest News: Warangal: వరంగల్‌లో వీధికుక్కల ఆగడాలు! బాలికపై దారుణ దాడి!

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఇప్పటికే హెలిప్యాడ్లు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి నేవీ హెలికాప్టర్లను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదనంగా, విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బందిని సైతం ప్రభావిత జిల్లాల్లో మోహరించారు. అవసరమైతే ఇంకా అదనపు దళాలను పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పేర్కొంది.

అటు కాకినాడలో తుఫాన్ తీరం దాటనుండడంతో అక్కడ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, వైర్లు తెగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు 3 వేలకు పైగా విద్యుత్ స్తంభాలను ముందుగానే సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. తుఫాను పూర్తిగా దాటే వరకూ, అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.