📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Amaravati Relaunch : అమరావతి పైలాన్‌ ప్రత్యేకతలు తెలుసా..?

Author Icon By Sudheer
Updated: May 2, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టానికి నాంది పలికే రోజు రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా, రాజధాని పునర్నిర్మాణానికి గుర్తుగా ‘A’ ఆకారంలో 21 అడుగుల ఎత్తైన ప్రత్యేక పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ పైలాన్, తాత్కాలికం కాదే శాశ్వతంగా అమరావతిలో నిలిచే విధంగా రూపొందించారు. అమరావతి మొదటి అక్షరమైన ‘A’ ఆధారంగా రూపొందించిన ఈ గుర్తు భవిష్యత్తులో రాజధాని అభివృద్ధికి గుర్తుగా నిలవనుంది.

అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు

ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రానికి చెందిన దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో భాగంగా అమరావతిలో హైకోర్టు భవనం, అసెంబ్లీ, సెక్రటేరియట్, మంత్రుల మరియు న్యాయమూర్తుల నివాసాల నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. ఈ 49,040 కోట్ల విలువైన నిర్మాణ పనులు అమరావతి పరిధిలో జరుగనున్నాయి. అంతేకాదు, డీఆర్డీవో, రైల్వే శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన రాష్ట్రవ్యాప్తంగా 57,962 కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా నాగాయలంకలో రూ.1500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు శంకుస్థాపన కీలక ఘట్టంగా నిలవనుంది.

భారీ ఏర్పాట్లు – భద్రతతో కూడిన సభ

ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సభకు దాదాపు 5 లక్షల మంది హాజరుకావచ్చునని అంచనా వేస్తున్నారు. భారీగా జన సంద్రం తలెత్తకుండా మూడు వేర్వేరు ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. వర్షం ఎఫెక్ట్‌ తలెత్తకుండా టెంట్లు, గాలెరీలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రత్యేక మార్గాలను సూచించారు. ప్రధాని రాక నేపథ్యంలో ఎస్‌పీజీ భద్రతను భద్రముగా చేపట్టింది. ప్రధాన వేదికపై కేవలం 14 మంది ప్రముఖులకు మాత్రమే ప్రవేశం కల్పించి, సభను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించనున్నారు.

Read Also :Amit Shah : ఉగ్రవాదం నిర్మూలనపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amaravati Pylon Amaravati Pylon features Amaravati relaunch Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.