📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Smart Ration Cards – స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

Author Icon By Shravan
Updated: August 26, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Smart Ration Cards : కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 9 జిల్లాల్లో ప్రారంభమైంది.. ఉచితంగా 1.45 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల (Smart ration cards) పంపిణీ కుటుంబాలకు కార్యక్రమం ఉదయం సోమవారం మొదలైంది. చౌకబియ్యం పక్కదారి పట్టకుండా నివారించడమే లక్ష్యంగారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ రైస్ కార్డులను నేటి నుంచి పంపిణీ చేస్తోంది. లబ్దిదారులకు సాంకేతిక హంగులతో స్మార్ట్ కార్డులు అందిస్తున్నారు. ప్రత్యేకతలు క్యూఆర్ కోడ్వంటి రూపొందించారు. దీనివల్ల రాష్ట్రంలో ఎక్కడి వారైనా, ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పంపిణీ ప్రక్రియ వచ్చే నెల 15 తేదీ వరకు 4 విడతల్లో జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ తిరుపతి, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడలో వరలక్ష్మీనగర్ లోను, కృష్ణాజిల్లా పెనమలూరులోను స్మార్ట్ రైస్ కార్డులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఏ కార్డులను ప్రారంభించారు. అనంతరం సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నారు. 15 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు ఉచితంగా ఇంటింటికీ వెళ్లి అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.

ఏపీ ప్రభుత్వం స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ప్రారంభం

Smart Ration Cards – స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

ఇక రాష్ట్రంలో నేటి నుంచి మొదటి విడత ప్రక్రియ కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు. అదే విధంగా రెండో విడతను ఈనెల 305 తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. స్మార్ట్ రైస్ కార్డులను ఏటీఎం కార్డు తరహాలో జేబులో ఇమిడి పోయే విధంగా తయారు చేశారు. ఈ స్మార్ట్ కార్డులపై ఒకవైపు రాజముద్రతో పాటు లబ్ధిదారు ఫొటో ఉండే విధంగా రూపొందించారు. మరోవైపు క్యూఆర్ కోడ్ ఉండేలా ముద్రించారు. కార్డుపై ఎటువంటి రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్తగా రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా త్వరలోనే కార్డులు రానున్నాయని అధికారులు పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 6.70 లక్షల కార్డుదారులతో పాటు అడ్రస్ మార్పు చేసుకున్న వారికీ స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ సహా పలు సాంకేతిక అంశాలతో స్మార్ట్ కార్డులు తయారు చేశారు. రేషన్ డీలర్ల (Ration dealers) వద్ద ఉండే ఈ పోస్ యంత్రాలనూ ప్రభుత్వం ఆధునికీకరించింది. స్మార్ట్ రైస్ కార్డుతో స్కాన్ చేసి బయోమెట్రిక్, ఐరీష్ గుర్తింపుతో సరకులు పంపిణీ చేసే ఏర్పాట్లు చేశారు. సరకుల పంపిణీ సమాచారం ఎప్పటికప్పుడు కేంద్ర సర్వర్ కు చేరవేసేలా రూపొందించారు. రేషన్, సరకుల పంపిణీలో అక్రమాలు వివరించడమే లక్ష్యం.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/innovative-innovations-in-the-medical-field-chandrababu/andhra-pradesh/536377/

Andhra Pradesh News Breaking News in Telugu Latest News in Telugu Ration Card Distribution smart cards Smart Ration Cards Telugu News Paper Welfare schemes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.