📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఏపీలో నేటి నుంచి బడ్జెట్‌పై చర్చ

Author Icon By sumalatha chinthakayala
Updated: March 3, 2025 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: ఏపీలో ఈరోజు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి శాసనసభలో పద్దుపై చర్చ జరుగనుంది. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు పాఠశాలలకు ప్రహరీగోడల నిర్మాణం,వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లు, వక్ఫ ఆస్తుల రికార్డుల డిజిటైజేషన్, డీఎస్స్సీ నోటిఫికేషన్, శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ తదితర అంశాలపై చర్చించనున్నారు. గిరిజన యువతకు ఉపాధి, గోదావరి పుష్కరాలు, మహిళలు-చిన్నారులపై అఘాయిత్యాలు, మాదకద్రవ్యాల వినియోగం, గోదావరి డెల్టా సాగునీటి కాలువల నిర్వహణ అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇస్తారు.

వివిధ అంశాలపై ప్రశ్నలకు సమాధానం

మరోవైపు శాసనమండలిలో ఈరోజు బడ్జెట్​పై తొలిరోజు చర్చ జరుగనుంది. శాసనమండలిలో నేటి ప్రశ్నోత్తరాల్లో పులివెందుల గృహనిర్మాణ పథకంలో అక్రమాలు, పోర్టుల నిర్మాణం,ఏపీఎండీసీ వాటాల విక్రయం, పేదలకు ఇళ్లస్థలాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇవ్వనున్నారు. కోళ్లకు వైరస్, మండల పరిషత్​లు – గ్రామపంచాయితీల్లో నిధుల దుర్వినియోగం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెవెన్యూ సదస్సులు, ఆరోగ్యశ్రీ పథకం తదితర అంశాలపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.

ఏపీ బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్ల మార్కు

ఆంధ్రప్రదేశ్​లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూ.3,22,359 కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శుక్రవారం నాడు అసెంబ్లీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏపీ బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. రూ.48,341 కోట్లతో వ్యవసాయ పద్దును ఆ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు పద్దులో విస్తృత కసరత్తు చేశారు.

AP Budget Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.