📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Telugu News: Vijayawada-అదుపులోకి వస్తున్న డయేరియా

Author Icon By Sushmitha
Updated: September 17, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజరాజేశ్వరిపేటలో ప్రబలిన డయేరియా(Diarrhea) కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుహాసిని తెలిపారు. ఇప్పటివరకు 313 కేసులు నమోదవగా, 253 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కేవలం 60 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. వైద్య శిబిరాలు, విజయవాడ(Vijayawada) జీజీహెచ్‌లలో బాధితులకు 24 గంటల పాటు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నామని అధికారులు చెప్పారు. తాగునీటి శాంపిళ్లకు సంబంధించిన పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి ప్రణాళికను నిర్ణయిస్తామన్నారు.

ప్రభుత్వ సేవలు, ప్రజల డిమాండ్లు

రాజరాజేశ్వరిపేటలో డయేరియా అదుపులోకి వస్తుందని, కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారికి వైద్య శిబిరంలో, పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి జీజీహెచ్‌లో చికిత్స(Treatment at GGH) అందిస్తున్నారు. బాధితులకు మందులతో పాటు ఐవీ ఫ్లూయిడ్స్ కూడా అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సదుపాయాలు బాగున్నాయని బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే, బాధితులు కూలీ పని చేసుకునేవారు కావడంతో ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఆహార పదార్థాలతో పాటు ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలు

డయేరియా వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు పలు ముందస్తు చర్యలు తీసుకున్నారు. రక్షిత తాగునీటి సరఫరాను నిలిపివేసి, ఇంటింటికీ వాటర్ క్యాన్‌లను అందిస్తున్నారు. సమస్య తీవ్రం కాకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను, హోటళ్లను, చిన్నచిన్న దుకాణాలను మూసివేశారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. కేసుల ఉధృతి తగ్గిందని, ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కోరారు.

విజయవాడలో మొత్తం డయేరియా కేసులు ఎన్ని నమోదయ్యాయి?

ఇప్పటివరకు 313 డయేరియా కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం ఎంతమంది చికిత్స పొందుతున్నారు?

ప్రస్తుతం 60 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tg-group-1-dont-play-politics-with-childrens-future/telangana/548707/

diarrhea outbreak Google News in Telugu Health Department Latest News in Telugu medical services public health. Rajarajeswaripeta Telugu News Today Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.