📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Liquor Scam Case : ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డికి రిమాండ్

Author Icon By Sudheer
Updated: May 18, 2025 • 10:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న లిక్కర్ కుంభకోణం కేసు(AP Liquor Scam Case)లో మరో కీలక మలుపు ఏర్పడింది. ఈ కేసులో A-31 గా ఉన్న ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy), A-32 గా ఉన్న కృష్ణ మోహన్ రెడ్డి (Krishna Mohan Reddy) ను పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు నిందితులకు మే 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు దాదాపు మూడు గంటల పాటు వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఈ రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు.

విజయవాడ జైలు కు తరలింపు

రిమాండ్ అనంతరం పోలీసులు ఇద్దరు నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో నిందితులందరినీ ఒకేసారి విచారణ చేయాలని భావించిన కోర్టు, అన్ని విషయాలను పరిశీలించి వారిని ఇతర నిందితులతో కలిపి రిమాండ్‌లోకి తీసుకుంది. కేసులో కీలకమైన ఆధారాలు వెలుగులోకి రావాల్సిన నేపథ్యమందు, విచారణ మరింత వేగంగా సాగే అవకాశం ఉంది.

కోర్టు ప్రత్యేక ఆదేశాలు

ఇక నిందితుల వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కోర్టు ప్రత్యేక ఆదేశాలు కూడా ఇచ్చింది. ధనుంజయ రెడ్డికి ఇన్సులిన్ అవసరం ఉండటంతో ఆయన కోసం జైలులో ఫ్రిజ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే, వెస్ట్రన్ కమోడ్, మంచం, దిండు, దుప్పటి, డ్రైఫ్రూట్స్ వంటివాటికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ అంశాలు మరోసారి లిక్కర్ కేసులో నిందితుల ప్రాధాన్యతను, ఆరోగ్యపరమైన అంశాలను చూపిస్తున్నాయి.

Read Also : Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో వానలేవానలు

Ap AP Liquor Scam Case Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.