నేడు ద్వారకా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

Read Time:  1 min
నేడు ద్వారకా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
FONT SIZE
GET APP

అమరావతి: జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు(శుక్రవారం) ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీనరసిహ స్వామిని దర్శించుకోనున్నారు. తర్వాత, టీడీపీ కూటమి హామీల ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

కాగా, ఏపీలో 1.55 కోట్ల మందికి దీపం-2 పథకం అమలు చేయబడుతున్నట్లు వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలని మంత్రి నాదెండ్ల సూచించారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతీ వ్యక్తి ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. దీపం పథకం కింద 24 గంటల్లో సిలిండర్ డెలివరీ అందుతుందని, చెల్లించిన సొమ్ము 48 గంటల్లో ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.