ఇప్పుడు తెలుగు సినిమా (Telugu movie) కేవలం ప్రాంతీయ స్థాయిలో మాత్రమే కాకుండా, గ్లోబల్ స్థాయిలో కూడా తన ముద్ర వేసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) కేంద్రాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలు, వాతావరణం, కళాత్మకతను సమీక్షించారు.ఈ సందర్శన సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), “ఎన్ఎస్డీ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే ఇది ఒక చిన్న భారతదేశం లాంటి అనుభూతి కలిగించింది.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక సంపద ఇక్కడ కలిసినట్టు కనిపిస్తోంది” అని అన్నారు. తన నటనలో పునాది వేసిన గురువు సత్యానంద్ (Guru Satyanand) గారు తరచుగా ఎన్ఎస్డీ గురించి చెప్పేవారని, అక్కడే ప్రొఫెషనల్ నటనకు కావాల్సిన మౌలిక శిక్షణ అందుతుందని ఆయన గుర్తుచేశారు. కళలు లేని సమాజంలో హింస ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఏపీలో కూడా ఎన్ఎస్డీ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచన
అంతేకాకుండా, కళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్ఎస్డీ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) తో చర్చిస్తానని ఆయన తెలిపారు. యువ కళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి సంస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: