📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

జగన్ గుంటూరు పర్యటనకు అనుమతి నిరాకరణ

Author Icon By sumalatha chinthakayala
Updated: February 19, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు జగన్ పర్యటనకు అనుమతి నిరాకరణ

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైస్ జగన్ ఈరోజు గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు మిర్చి యార్డును సందర్శించనున్నారని తొలుత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. అయితే జగన్ పర్యటనకు ఈసీ బ్రేకులు వేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మిర్చి యార్డులోకి జగన్ కి అనుమతి లేకుండా ఈసీ నిరాకరించింది. అయినప్పటికీ మిర్చి రైతులను అడిగి తెలుసుకుంటామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు జగన్ పర్యటనకు అనుమతి నిరాకరణ.

రైతాంగానికి భరోసా ఇచ్ఛామని వైసీపీ

మిర్చీకి రేటు లేక అవస్థలు పడుతున్న రైతుల గోడు వినడానికి జగన్ వస్తున్నారని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతుంది. యార్డులో మిర్చి రైతులు దగా పడుతున్నారు. వరి, పత్తికి రేటు లేక రైతులు విలవిలలాడుతున్నారు. గతంలో 9వేలు పలికిన పత్తి ఇప్పుడు 4వేలకు కూడా కొనేవాడు లేడు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వమే రైతు దగ్గర ధాన్యాన్ని మేమే కొనుగోలు చేశాం. రైతాంగానికి భరోసా ఇచ్ఛామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.

జగన్ పర్యటనపై సందిగ్ధత

ఇంకోవైపు, జగన్ పర్యటనకు వైసీపీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పర్యటన షెడ్యూల్ ను వైసీపీ విడుదల చేసింది. దాని ప్రకారం, ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్ బయల్దేరుతారు. 11 గంటలకు మిర్చియార్డుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మిర్చియార్డులో రైతులతో చర్చించి… తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. పర్యటనకు ఈసీ అనుమతి నిరాకరించడంతో… జగన్ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.

Breaking News in Telugu Google news Google News in Telugu Guntur Tour Latest News in Telugu Telugu News online YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.