📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

TTD: శ్రీవాణి ఐదింతలు డిమాండ్

Author Icon By Shravan
Updated: August 18, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tirumala : మూడు రోజులు వరుస సెలవులు (Three consecutive days off) వారాంతం రద్దీ పెరగడంతో తిరుమలలో ఏరోజుకారోజు శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆఫ్లైన్లో ప్రత్యేక కౌంటర్లలో 800 టిక్కెట్లు జారీచేస్తుండగా ఐదింతలు రెట్టింపయిన భక్తులు ఈ టిక్కెట్లకు ఐదువేల మంది వరకు క్యూలైన్లలో బారులుతీరి నిలబడు తున్నారు. ఆదివారం సాయంత్రం దర్శనానికి సంబంధించి శనివారం రాత్రి 9 గంటల (Saturday night 9 pm) ప్రాంతంలో శ్రీవాణి టిక్కెట్లు జారీచేసే కౌంటర్ ప్రాంతంలో భక్తులు బారులు తీరారు. అయితే గత రాత్రి జరిగిన తోపులాట, రద్దీతో ఆదివారం ఉదయం 10 గంటలకే భక్తులకు దర్శన టిక్కెట్లు జారీచేశారు. శనివారం రాత్రి క్యూలో ముందు గానే వచ్చిన భక్తులను విజిలెన్స్ సిబ్బంది ముందుగా సమాచారం అందించి అక్కడకు వెనక్కుపంపారు. దీంతో ఆదివారం వేకువజామున 4గంటలనుండే భారీగా భక్తులు ఈ కౌంటర్వద్ద నిలబడ్డారు. ఓవైపు చిరుజల్లులు కురుస్తున్నా, విపరీతమైన చలిగాలులు వున్నా భక్తులు ఖాతర్చేయలేదు. తమకు ఆ దేవుని దర్శనం చేసుకుంటే చాలనే విశ్వాసం వ్యక్తం చేశారు.

సాధారణరోజల్లోకూడా TTD విపరీతమైన డిమాండ్ ఉంది. పైగా ఉదయం టిక్కెట్లు జారీచేస్తే సాయంత్రం ఆలయంలోపల కులశేఖరపడివద్ద మొదటిగడప నుండి శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రశాంతంగా, కళ్లారా మరీ దగ్గరగా దర్శనం చేసుకునే భాగ్యం ఉండటంతో చాలావరకు భక్తులు ఈ దర్శనాలపై ఆధారపడుతున్నారు. టిటిడి అధికారులు ఈ టిక్కెట్లను పెంచాలని భక్తులు కోరుతున్నారు. సాదారణరోజుల్లోనూ 1,500మంది వరకు భక్తులు శ్రీవాణికోసం డిమాండ్ ఉంది. ఇక వారాంతం, ప్రత్యేక సెలవురోజుల్లో ఈ రద్దీ ఐదిం తలు రెట్టింపవుతోంది. మరీ టిటిడి అధికారులు భక్తుల అవసరానికి ఎలా స్పందిస్తారనేది చూడాల్సిందే. రానున్న రోజుల్లో సామాన్య భక్తులు కూడా దేవదేవుడిని మరింత దగ్గరగా ప్రశాంతంగా దర్శనం చేసుకునే వీలుకలిగేలా శ్రీవాణి బ్రేక్ దర్శనాలపైనే ఆధారపడే సూచనలు లేకపోలేదు. ప్రస్తుతం రోజువారీగా 2వేలమంది భక్తులు శ్రీవాణి బ్రేక్ దర్శనం చేసుకుంటున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/tourism-widespread-promotion-of-tourist-destinations/andhra-pradesh/531774/

Breaking News in Telugu Latest News in Telugu Srivani Demand Telugu News tirumala Tirumala News Tirumala updates Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.