ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన నల్లమల సాగర్ ప్రాజెక్టు అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంగా మారి, ఢిల్లీ వేదికగా రాజకీయ రణరంగంగా పరిణమించింది. ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, తన పోరాట వ్యూహాన్ని మార్చింది. ఇప్పటివరకు కేవలం లేఖల ద్వారా నిరసన తెలిపిన సర్కార్, ఇప్పుడు కేంద్రం సాక్షిగా అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నెల 30న (జనవరి 30) ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుంది.
Nandigam Suresh: దంపతుల నుంచి ప్రాణహాని ఉందంటూ వ్యక్తి ఆరోపణలు
నల్లమల సాగర్ వంటి ప్రాజెక్టులు అక్రమమని, వీటికి ఎటువంటి అనుమతులు లేవని నిరూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ఆధారాలను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును నిలువరించకపోతే సమావేశానికి హాజరు కాబోమని గతంలోనే హెచ్చరించిన తెలంగాణ, ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆ సమావేశంలోనే ఏపీ అక్రమ నిర్మాణాలను ఎండగట్టాలని భావిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో, నల్లమల సాగర్ ద్వారా ఏపీ అదనపు నీటిని తరలించే ప్రయత్నం చేస్తోందని గణాంకాలతో సహా వివరించడానికి సిద్ధమైంది.
నల్లమల అడవుల గుండా సాగే ఈ ప్రాజెక్టు పర్యావరణపరంగా కూడా ముప్పు అని తెలంగాణ వాదిస్తోంది. ఈ వివాదం కేవలం రెండు రాష్ట్రాల మధ్యే కాకుండా, కేంద్ర జలశక్తి శాఖ పరిధిలో ఒక క్లిష్టమైన సమస్యగా మారింది. 30న జరిగే భేటీలో కేంద్రం ఏ రకమైన మధ్యవర్తిత్వం వహిస్తుంది? తెలంగాణ సమర్పించిన సాక్ష్యాధారాలపై ఏపీ ఏ విధంగా స్పందిస్తుంది? అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ పోరులో పైచేయి సాధించేందుకు అటు అమరావతి, ఇటు హైదరాబాద్లలో అధికారులు నిరంతరం కసరత్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com