విజయవాడ: వ్యవసాయ శాఖ నాణ్యత ప్రమాణాలకు హామీగా ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన రాష్ట్ర వ్యవసాయ ప్రయోగశాలలు/పరీక్ష కేంద్రాలుకు ఎన్ఏబిఎల్ (NABL) గుర్తింపు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో నాణ్యత ప్రమాణాలను బలోపేతం చేసేందుకు వ్యవసాయ శాఖ తీసుకుంటున్న చర్యలలో ఇది మరొక కీలకమైన మైలురాయి అని డిల్లీ రావు వ్యాఖ్యానించారు. పురుగు మందుల, జీవ సంబంధిత, సేంద్రీయ, ఎరువుల రసాయనిక విశ్లేషణలకు ఆధునిక సదుపాయాలను కల్పిస్తున్న నెల్లూరు, బాపట్ల, కర్నూలు లోని ప్రయోగశాలలకు నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ సంస్థ (National Accreditation Board for Testing and Calibration Laboratories) గుర్తింపు లభించింది.

జీవ, సేంద్రీయ ఎరువుల నాణ్యత
ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖకు గర్వకారణమైన విషయమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందినవిగా గుర్తించబడ్డాయి అని అన్నారు .ఎరువుల నియంత్రణ ప్రయోగశాల బాపట్ల జీవ, సేంద్రీయ ఎరువుల నాణ్యత నియంత్రణ ప్రయోగశాల నెల్లూరు. పురుగుమందుల పరీక్ష కేంద్ర ప్రయోగశాల కర్నూలులను తమ సాంకేతిక నైపుణ్యం, గ్లోబల్ ప్రమాణాలతో నాణ్యత పరీక్షల రంగములో సామర్థం, ప్రమాణాలు నిరూపించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయతను సంపాదించాయని తెలిపారు. ఎన్ఏబిఎల్ గుర్తింపు ద్వారా వ్యవసాయ వనరుల నాణ్యతపై రైతులకు నమ్మకం మరింత బలపడుతుంది. అని, ఉత్పాదకతలో నాణ్యతా ప్రమాణాలను స్థిరపరిచే దిశగా కీలక అడుగు అని తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ ప్రయోగశాలలు/పరీక్ష కేంద్రాలకు ఎన్ఏబిఎల్ (NABL) గుర్తింపు అంటే ఏమిటి?
NABL (National Accreditation Board for Testing and Calibration Laboratories) గుర్తింపు అనేది పరీక్షా ప్రయోగశాలలు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని ధృవీకరించే సర్టిఫికేషన్. వ్యవసాయ ప్రయోగశాలలకు NABL గుర్తింపు లభిస్తే, ఆ ప్రయోగశాలల పరీక్షా ఫలితాలు విశ్వసనీయంగా, ప్రమాణబద్ధంగా గుర్తింపు పొందుతాయి.
ఈ NABL గుర్తింపు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది?
NABL గుర్తింపు కలిగిన పరీక్షా కేంద్రాల్లో మట్టి, నీరు, ఎరువులు, విత్తనాలు వంటి నమూనాలను పరీక్షిస్తే, ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. రైతులు ఈ ఫలితాల ఆధారంగా సరైన ఎరువుల మోతాదు, పంట పద్ధతులు, నీటి వనరుల వినియోగం వంటి నిర్ణయాలు తీసుకుని ఉత్పత్తి, నాణ్యతను పెంచుకోగలరు.
Read hindi news: hindi.vaartha.com
Read Also :