Nellore crime news today: అంతేలేని అవినీతికి పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన దగదర్తి తాశిల్దార్ పాల కృష్ణ ఇంటితోపాటు, అతని బంధువులు స్నేహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.కోట్ల విలువచేసే ఆస్తులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఏసీబీ డిఎస్పి రామకృష్ణుడు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. బుచ్చిరెడ్డిపాలెం కు చెందిన పాల కృష్ణ 2017లో డిప్యూటీ తాసిల్దారుగా రెవిన్యూ శాఖలో ఉద్యోగం పొందారు.
Read Also:ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్
అప్పటినుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం దగదర్తి మండల తాసిల్దారుగా ఉద్యోగ బాధ్యతలో ఉన్నారు. ఇతనిపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో నెల్లూరు(Nellore crime news today) నగరం టైలర్స్ కాలనీ ప్రాంతంలోని కృష్ణ ఇంటి తోపాటు బుచ్చిరెడ్డిపాలెంలోని అతని ఇల్లు, బంధువులు స్నేహితుల ఇళ్లతో పాటు దగదర్తి తాసిల్దార్ కార్యాలయంలో దాడులు చేపట్టి సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు అక్రమాస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు. నెల్లూరు నగరంలో జి ప్లస్ త్రీ భవనం, ఇంట్లో 398 గ్రాముల బంగారు ఆభరణాలు, పలుచోట్ల విలువైన స్థలాలను సంబంధించిన డాక్యుమెంట్లు, రూ. లక్ష నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దగదర్తి లోని తాసిల్దార్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగాయి. ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 20 కోట్ల పైబడి ఉంటుందని ప్రాథమిక అంచనా. రోగాలు శుక్రవారం రాత్రి కూడా కొనసాగుతాయని శనివారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఎస్పి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: