మొంథా తుఫాను(Cyclone) ప్రభావం క్రమంగా తగ్గింది. బంగాళాఖాతంలో ఏర్పడి భీకర తుఫానుగా మారిన మొంథా ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై కొనసాగుతోంది. తుఫాను బలహీనమైనప్పటికీ, దాని తేమ ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Also: AP Govt: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ఒక్కొక్కరికి రూ.1000

గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు(Cyclone) పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, కొండప్రాంతాల్లో వర్షాలతో పాటు గాలులు వేగంగా వీచే అవకాశం ఉందని సూచించారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు.
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) మాట్లాడుతూ, “తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు పంట నష్టాల అంచనా ఐదు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించాం. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా రాబోయే 48 గంటలపాటు వర్షాలు, గాలులు కొనసాగవచ్చని తెలిపింది. తీరప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: