అనుమానం పెనుభూతమన్నారు పెద్దలు. ఒక్కసారి ఆ ఆలోచన వచ్చిందా అది ఇంతింతై మహావృక్షంగా పెరిగిపోతుంది. అనుమానం ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. అనుబంధాలను కాలరాసింది. అందుకే అనుమానం రాకూడదు. ఆ భావన కలగకుండా జాగ్రత్తపడాలి. కాని కొందరికి ఎలాంటి ఆధారాలు లేకుండానే మానసిక రుగ్మతకు గురై అనుమానిస్తుంటారు. ఇలాంటివారు ఎలాంటి ఘోరమైన పనులు చేసేందుకైనా వెనుకాడరు. ఓ భర్త అదే పని చేశాడు. అనుమానంతో కట్టుకున్న భార్యను హతమార్చాడు. (Crime) దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
Read Also: Tirumala: ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ప్రేమించి, పెళ్లాడారు..
పల్నాడు జిల్లా (Palnadu district) రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (28)ని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏట్చూరుకు చెందిన అల్లడి వెంకటేశ్వర్లు ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేష్ బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల వెంకటేశ్వర్లుకు తన భార్య మహాలక్ష్మిపై అనుమానాన్ని పెంచుకున్నాడు. దీంతో వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవల వల్ల మహాలక్ష్మి రెండునెలలుగా భర్తకు దూరంగా మాచవరంలోని పుట్టింట్లో ఉంటోంది.
మాట్లాడాలని నమ్మించి హత్య చేసిన భర్త ఆదివారం ఉదయాన్నే వెంకటేశ్వర్లు మాచవరంకు వచ్చాడు. పాపకు తెచ్చానని, ఇంటికి వెళదామని నమ్మబలికి, ఆమెను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని, మార్గమధ్యలో ఆమెను హతమార్చాడు. మహాలక్ష్మి ధరించిన స్వెట్టర్ కు ఉన్న తాడును ఆమె గొంతుకు బిగించి, చంపాడు. అనంతరం మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై పెట్టుకుని, పోలీసుస్టేషన్ కు తీసుకొచ్చాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: