हिन्दी | Epaper
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Telugu News: Crime: భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

Sushmitha
Telugu News: Crime: భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

అనుమానం పెనుభూతమన్నారు పెద్దలు. ఒక్కసారి ఆ ఆలోచన వచ్చిందా అది ఇంతింతై మహావృక్షంగా పెరిగిపోతుంది. అనుమానం ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. అనుబంధాలను కాలరాసింది. అందుకే అనుమానం రాకూడదు. ఆ భావన కలగకుండా జాగ్రత్తపడాలి. కాని కొందరికి ఎలాంటి ఆధారాలు లేకుండానే మానసిక రుగ్మతకు గురై అనుమానిస్తుంటారు. ఇలాంటివారు ఎలాంటి ఘోరమైన పనులు చేసేందుకైనా వెనుకాడరు. ఓ భర్త అదే పని చేశాడు. అనుమానంతో కట్టుకున్న భార్యను హతమార్చాడు. (Crime) దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

Read Also: Tirumala: ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

Crime
Crime Wife’s suspicion raised.. To the police station with the body..

ప్రేమించి, పెళ్లాడారు..

పల్నాడు జిల్లా (Palnadu district) రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (28)ని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏట్చూరుకు చెందిన అల్లడి వెంకటేశ్వర్లు ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేష్ బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల వెంకటేశ్వర్లుకు తన భార్య మహాలక్ష్మిపై అనుమానాన్ని పెంచుకున్నాడు. దీంతో వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవల వల్ల మహాలక్ష్మి రెండునెలలుగా భర్తకు దూరంగా మాచవరంలోని పుట్టింట్లో ఉంటోంది.

మాట్లాడాలని నమ్మించి హత్య చేసిన భర్త ఆదివారం ఉదయాన్నే వెంకటేశ్వర్లు మాచవరంకు వచ్చాడు. పాపకు తెచ్చానని, ఇంటికి వెళదామని నమ్మబలికి, ఆమెను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని, మార్గమధ్యలో ఆమెను హతమార్చాడు. మహాలక్ష్మి ధరించిన స్వెట్టర్ కు ఉన్న తాడును ఆమె గొంతుకు బిగించి, చంపాడు. అనంతరం మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై పెట్టుకుని, పోలీసుస్టేషన్ కు తీసుకొచ్చాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870