📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Court – పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ – జంట హత్యల కేసు

Author Icon By Shravan
Updated: August 30, 2025 • 9:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Court : వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (Pinnelli Ramakrishna Reddy) సోదరులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జంట హత్య కేసులో రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిష న్లను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజక వర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు (TDP leaders) జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య ఘట నలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ6, వెంకట్రా మిరెడ్డి ఏ7 నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనలో పిన్నెల్లి సోదరుల పాత్ర ఉందని పోలీసుల తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీని వాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. హత్య ఘటనలో పిన్నెల్లి సోదరుల కుట్ర, ప్రోద్బలం ఉందన్నారు. నిందితులు ఓ రెస్టారెంట్లో సమావేశమై హత్యకు కుట్రపన్నారన్నారు. హత్య ఘటనలో పాల్గొన్న వ్యక్తులతో పిన్నెల్లి సోదరులు ఫోన్లో మాట్లాడారని, వాటికి సంబంధించి సాంకేతిక ఆధారాలు న్నాయన్నారు. సర్పంచ్ పదవికి పోటీ చేస్తే తాము మద్దతిస్తామని ఏ1 నిందితుడికి పిన్నెల్లి సోదరులు హామీ ఇచ్చారన్నారు. వాస్తవాలను వెలికి తీయాలంటే వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సి ఉందన్నారు. బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు.

Court – పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ – జంట హత్యల కేసు

పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది

ముందస్తు బెయిలు పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ఫిర్యాదు దారుడు తోట ఆంజనేయులు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టిన చరిత్ర పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గండ్లపాడు గ్రామంలో 2022లో చోటు చేసుకున్న ఓహత్య కేసులో పిటిషనర్ల పాత్ర ఉందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎఫ్ఎఆర్ లతో పేర్లు లేకుండా చేసుకున్నారన్నారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సార్వత్రిక ఎన్నికల తర్వాత పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయండి అని కోరారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులో పిటీషనర్లలను ఇరికించారని 5 పిటీషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషనన్ను హైకోర్టు కొట్టివేసింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/highway-construction-of-six-lane-highway-between-vijayawada/andhra-pradesh/538096/

Andhra Pradesh politics AP crime news Breaking News in Telugu double murder case High Court news Latest News in Telugu legal news India Pinnelli Brothers Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.