📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

Cold wave: తెలుగు రాష్ట్రాల్లో చలి.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Author Icon By Pooja
Updated: December 21, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత(Cold wave) రోజు రోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా భారీగా తగ్గిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోవడంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉదయం వేళల్లో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

Read Also:TG Weather: తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Cold wave

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కసారిగా చలి ప్రభావం(Cold wave) ఎక్కువగా కనిపిస్తుండగా, తెలంగాణలోనూ అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి దిగజారినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో చలిని తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్ ప్రాంతంలో శనివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతగా అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ప్రాంతంలో 4.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.రాబోయే రెండు రోజుల పాటు కూడా చలి తీవ్రత కొనసాగడంతో పాటు మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు చలిబాధల నుంచి రక్షణ చర్యలు పాటించాలని సూచించింది.

ఇక హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత అధికంగా ఉండటంతో నగరవాసులు వణికిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోతున్నాయి. శనివారం శేరిలింగంపల్లిలో 7.8 డిగ్రీలు, మల్కాజ్‌గిరిలో 8.3 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి, ఉదయం మాత్రమే కాకుండా మధ్యాహ్నం వేళల్లో కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోవచ్చని అధికారులు హెచ్చరిస్తూ, వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.