Rajahmundry Milk Case: కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

Read Time:  1 min
Rajahmundry Milk Case: కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష
FONT SIZE
GET APP

Rajahmundry Milk Case: రాజమండ్రిలో వెలుగుచూసిన కల్తీ పాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.అధికారులు 75 మంది నుంచి పాలు శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు. కల్తీ పాలు అని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అధికారులు వెంటనే రాజమండ్రికి వెళ్లాలని ఆయన ఆదేశించారు.

Read Also: Tirumala Darshan Update: తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ

CM serious about adulterated milk.. Urgent review with officials
CM serious about adulterated milk.. Urgent review with officials

కేసు నమోదు

చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలలో కల్తీ పాలు తాగిన నలుగురు మృతి చెందగా, 13 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధితులు బాధపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టుతో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. అధికారులు అప్రమత్తమై, కల్తీ పాలు తాగిన కాలనీల్లో 13 బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.