CM Chandrababu: పొడి చెత్తకు కూడా డబ్బులు ఇస్తాం: సీఎం

Read Time:  1 min
CM Chandrababu: పొడి చెత్తకు కూడా డబ్బులు ఇస్తాం: సీఎం
FONT SIZE
GET APP

అనకాపల్లి జిల్లాలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు (CM Chandrababu).. వచ్చే జూన్ నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. అయితే అందుకు ప్రజా భాగస్వామ్యం అవసరమని అన్నారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన సుమారు 86 లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు చంద్రబాబు (CM Chandrababu) వివరించారు. చెత్తను సంపదగా మార్చాలనే ఉద్దేశంతో రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాటికి రాష్ట్రంలోని రోడ్లపై చెత్త కనిపించకూడదని అధికారులను ఆదేశించారు.

Read Also: Pawan Kalyan: కులాల రాజకీయాలపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

పొడి చెత్తను రోడ్లపై వేయడం మానుకోవాలి

మరోవైపు ఏపీ ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా స్వచ్ఛ రథాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. స్వచ్ఛ రథాల సాయంతో గ్రామాల్లోని ఇళ్ల వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. అలాగే చెత్తకు బదులుగా సరుకులను ఉచితంగా అందిస్తున్నారు. ఈ స్వచ్ఛరథం ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల ప్రవేశపెట్టారు. ఆయా ప్రాంతాల్లో మంచి స్పందన లభించడంతో ప్రస్తుతం 26 చోట్ల ఈ స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశారు.

CM Chandrababu: We will give money even for dry waste
CM Chandrababu: We will give money even for dry waste

ఈ నేపథ్యంలో అవసరమైతే 100 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేసి పొడి చెత్తను సేకరిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక ఇళ్లల్లోని పొడి చెత్తను రోడ్లపై వేయడం మానుకోవాలని చంద్రబాబు సూచించారు. పొడిచెత్తకు కూడా డబ్బులు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. రోడ్లు కూడా మనవేననే సంగతి ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఇంట్లో చెత్తను కంపోస్ట్‌గా తయారు చేసుకోవచ్చన్న చంద్రబాబు.. రాబోయే రోజుల్లో పట్టణాల్లో 5 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 10 లక్షల ఇళ్లల్లో ఇలాంటి కంపోస్ట్‌ తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.