हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు

Sudheer
25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుండి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తుల సందడి నెలకొననుండగా, ఆలయ పరిపాలన మండలి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీ సంవత్సరం మహాశివరాత్రికి ముందురోజు ఆలయానికి పట్టువస్త్రాల సమర్పణ ఆచారం కొనసాగుతోంది. ఈసారి ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరుకానున్నారు.

ఫిబ్రవరి 25న సీఎం చంద్రబాబు శ్రీకాళహస్తికి చేరుకొని, ఆలయ దేవస్థాన తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. గత సంవత్సరాల్లో మంత్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అయితే, ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు, హోమాలు, రథోత్సవం వంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.

srikalahasti temple

మహాశివరాత్రి ప్రధానోత్సవం ఫిబ్రవరి 26న జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రహోమం, శివపార్వతుల కల్యాణం వంటి విశేష కార్యక్రమాలు జరుగనున్నాయి. భక్తుల రద్దీ పెరగనున్న కారణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, ప్రసాదాల పంపిణీ, వైద్య సేవలు వంటి వసతులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

శ్రీకాళహస్తి ఆలయం దక్షిణ కాశీగా పేరొందిన పవిత్ర స్థలం. ప్రాచీన కాలం నుంచి మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. వేలాదిమంది భక్తులు దేశవ్యాప్తంగా ఈ వేడుకలకు హాజరవుతారు. ముఖ్యమంత్రి హాజరయ్యే నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టంగా అమలు చేయనున్నారు. పోలీసు అధికారులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.

భక్తులు మహాశివరాత్రి వేడుకలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి ఆలయ అధికారులు, పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి హాజరవడంతో ఈ వేడుకలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భక్తులు పెద్దఎత్తున తరలిరానుండగా, శ్రీకాళహస్తి ఆలయం మరోసారి భక్తిపారవశ్యంతో నిండిపోనుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870