📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

CM Chandrababu : పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి పై విచారణకు సీఎం ఆదేశం

Author Icon By sumalatha chinthakayala
Updated: April 7, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Chandrababu: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని లోకేష్ పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

పాస్టర్ ప్రవీణ్ మరణంపై సమగ్ర విచారణ

ప్రవీణ్ మృతిని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని చెప్పారు. అయితే వివిధ సంఘాలు పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తుందని లోకేష్ తెలిపారు. ఇక, పాస్టర్ ప్రవీణ్ పగాడల మృతిపై ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై సమగ్ర విచారణకు జరపాల్సిందిగా హోంమంత్రి అనిత ఆదేశించారు.

పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై అనుమానాలు

కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గామన్‌ బ్రిడ్జి రహదారిపై కొంత మూరు నయారా పెట్రోల్‌ బంకు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ పగాడల మృతిచెందినట్టుగా పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై సోమవారం రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్‌ అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. బైక్ అదుపుతప్పి రోడ్డు నుంచి దిగువకు పడిపోవడంతో మోటార్‌ సైకిల్‌ ప్రవీణ్‌కుమార్‌పై పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అయితే పాస్టర్ ప్రవీణ్‌ మృతిపై అనుమానాలు ఉన్నాయని క్రైస్తవ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

Breaking News in Telugu CM chandrababu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Pastor Praveen Kumar Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.